నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తు సొమ్మును ప్రభుత్వాలే చెల్లించాలి
దిల్లీ: 20అక్టోబర్ (హి.స.) విచారణలో ఉన్న (అండర్‌ ట్రయల్‌) నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు సొమ్ము విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బు చెల్లించాలని స్పష్
Supreme Court


దిల్లీ: 20అక్టోబర్ (హి.స.)

విచారణలో ఉన్న (అండర్‌ ట్రయల్‌) నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు సొమ్ము విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. నిరుడు ఫిబ్రవరి 13న జారీ చేసిన ‘ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ)’ను ఈ మేరకు సవరించింది. ఈ వ్యవహారంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి, అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా చేసిన సూచనలను ఆమోదిస్తూ జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మల ధర్మాసనం.. సవరించిన ఎస్‌వోపీని జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం- విచారణలో ఉన్న పేద ఖైదీలకు పూచీకత్తు డబ్బు చెల్లించే వ్యవహారంలో.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande