
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
మహిళలు, చిన్నారులకు భరోసా కల్పించేందుకు శంషాబాద్ లో భరోసా కేంద్రం ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన శంషాబాద్ డిసిపి ఆఫీసు పక్కన 33వ భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2016 లో మొదటి భరోసా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో మరో ఆరు జిల్లాలలో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. మహిళలు, చిన్నారులు, బాలికలకు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..