
హనుమకొండ, 31 అక్టోబర్ (హి.స.) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి
మండలం గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై పెండ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఈరోజు తెల్లవారుజామున బోర్వెల్స్ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందిన యువతిని, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో పెండ్లి జరిపించారు. వివాహ వేడుకల్లో భాగంగా వధువు తరుఫు బంధువులు వరుడి ఇంటికి వెళ్లారు. తిరిగి మహబూబాబాద్కు వెళ్తుండగా గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ దానిని ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఒకరు మృతిచెందగా, ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం ధాటికి బొలేరో తుక్కుతుక్కు అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు