విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్త వాతావరణం
విశాఖపట్టణం, 8 అక్టోబర్ (హి.స.) విశాఖ పట్టణంలోని పెదగంట్యాలడలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ (అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ) నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ స
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్త వాతావరణం


విశాఖపట్టణం, 8 అక్టోబర్ (హి.స.) విశాఖ పట్టణంలోని పెదగంట్యాలడలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ (అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ) నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో అంబుజా సిమెంట్స్‌ పబ్లిక్‌ హియరింగ్‌ మీటింగ్‌కు హాజరైన స్థానికులు. సిమెంట్‌ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన. గోబ్యాక్‌ అంబుజా సిమెంట్‌ (Ambuja Cement) అంటూ గ్రామస్తుల నినాదాలు. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం పోలీసులు, ఉన్నతాధికారులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande