
అమరావతి, 12 నవంబర్ (హి.స.):ఈనెల 14,15 తేదీల్లో విశాఖలో నిర్వహించే 30వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ) విశాఖ పర్యటన వివరాలు, ఎవరెవరిని కలువనున్నారు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తదితర వివరాలను అధికారులు వెల్లడించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ఈరోజు (బుధవారం) సాయంత్రం అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ముఖ్యమంత్రి నేరుగా విశాఖకు వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ