
అమరావతి, 12 నవంబర్ (హి.స.)
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి విదేశీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రానికి రానుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'X' వేదికగా వెల్లడించారు. 2019లో కొత్త కంపెనీలను ఆపేసిన ఆ ప్రాజెక్ట్.. ఈసారి తుపాన్లా భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రాబోతోందని ఆయన అన్నారు. దీనిపై గురువారం ఉదయం 9 గంటలకు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని లోకేశ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ