
విశాఖపట్నం, 13 నవంబర్ (హి.స.)విశాఖపట్నంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఎండాడలో పనోరమ హిల్స్ వెనుక పది ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసే ఈ ప్రాంతంలో పెద్ద స్టార్ హోటల్, ఆఫీసు స్పేస్తో పాటు కోవర్కింగ్ స్పేస్ వస్తాయి. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ