
ఆసిఫాబాద్, 16 నవంబర్ (హి.స.)
రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం తాము కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయాబీన్ ను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలన్నారు.
దళారులు, వ్యాపారుల చేతిలో మోసపోకుండా రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కేంద్రం కృషి చేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు