వేరు వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు దుర్మరణం
తెలంగాణ, 16 నవంబర్ (హి.స.) నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల శనివారం రాత్రి జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. నిర్మల్ పట్టణంలో ఓ యువకుడి బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో
రోడ్డు యాక్సిడెంట్


తెలంగాణ, 16 నవంబర్ (హి.స.) నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల శనివారం రాత్రి జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

నిర్మల్ పట్టణంలో ఓ యువకుడి బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు సాయిచరణ్(22) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడు ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ వార్తాపత్రికలో పని చేస్తున్నాడు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండలం పరిధిలోని లింబుగూడ గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సైదం భీమ్రం(53) తీవ్ర గాయాలపాలై మరణించాడు. ఈ రెండు ప్రమాద ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande