
యాదగిరిగుట్ట, 16 నవంబర్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నందలి యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూలైన్లన్ని నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కార్తీక మాసం చివరి ఆది వారం కావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ మాడ వీధులు రద్దీగా మారిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు