22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల, 17 నవంబర్ (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంద
తిరుమల


తిరుమల, 17 నవంబర్ (హి.స.)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(ఆదివారం) శ్రీవారిని 75,004 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.98 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande