సరస్వతీ నది అంత్య పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.. కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి, 21 నవంబర్ (హి.స.) దక్షిణ అరణ్య శైవ క్షేత్రముగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో మూడు నదుల కలియక అయిన త్రివేణి సంగమం లోని సరస్వతి నది అంత్య పుష్కరాల ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని జయశంకర్ భూపాలపల
జయశంకర్ కలెక్టర్


జయశంకర్ భూపాలపల్లి, 21 నవంబర్ (హి.స.)

దక్షిణ అరణ్య శైవ క్షేత్రముగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో మూడు నదుల కలియక అయిన త్రివేణి సంగమం లోని సరస్వతి నది అంత్య పుష్కరాల ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆలయ కార్యనిర్వహణ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande