
అల్లూరి జిల్లా, 22 నవంబర్ (హి.స.)
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. రేపు(ఆదివారం) దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. అయితే, వరుస ఎన్కౌంటర్లతో హడలిపోతున్నారు గిరిజనులు. ఏవోబీ సరిహద్దు ప్రాంతంతో పాటు మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మైదాన ప్రాంతాల్లోనూ మావోయిస్టుల కోసం నిఘా పెట్టారు ఏపీ పోలీసులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ