
ఆదిలాబాద్, 21 నవంబర్ (హి.స.)
పంట కొనుగోళ్లలో రైతులు
ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు నేడు దిగ్బంధించారు. బీఆర్ఎస్ తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు