
అమరావతి, 22 నవంబర్ (హి.స.), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్)పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ