
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ
మంత్రి కేటీఆర్ ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025'లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ వేదికపై జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొని, దక్షిణ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మరియు సాంకేతిక పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు