
మహబూబాబాద్, 23 నవంబర్ (హి.స.)
శాంతి భద్రతల పరిరక్షణ,మహిళలు, బాలికల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ ధ్యేయం అని మహాబూబాబాద్ జిల్లా కొత్త పోలీస్ బాస్ డాక్టర్ శబరీష్ అన్నారు. ఆదివారం రోజున ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని సోషల్ మీడియాలో వ్యక్తిగత మత పరమైన దూషణలు చేయడం తప్పుడు ప్రచారం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కురవి వీరభద్రుని దర్శించుకున్నారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు