
తిరుమల, 24 నవంబర్ (హి.స.)
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కార్తీక మాసం ముగియడం వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తుల రాక స్వల్పంగా తగ్గింది. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 17 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 60,098 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,962 మంది తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV