
నంద్యాల , 24 నవంబర్ (హి.స.),ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాళ్లు వల వేసి.. దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని 'జస్ట్ డయల్' యాప్ పేరిట మోసం చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ టూరిజం వసతి గదుల పేరిటా నకిలీ వెబ్సైట్తో వేలకు వేలు దోచుకుంటున్నారు. దీంతో భక్తులు నమ్మి వసతి గదులు బుక్ చేసుకుని.. తీరా అక్కడికి చేరుకున్నాక ఒక్కసారిగా కంగుతింటున్నారు. డూప్లికేట్ వెబ్సైట్లతో లబోదిబోమంటూ తలలు పట్టుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ