
రాజమండ్రి, 24 నవంబర్ (హి.స.):ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ) పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. ఎయిర్పోర్టులోకి రాజానగర్ టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణను అనుమతించకపోవడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం ప్రోగ్రాం కమిటీ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ను ఎలా అనుమతించారంటూ పోలీసులతో బొడ్డు వర్గం గొడవకు దిగింది. కాగా.. జిల్లా పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్ ఈరోజు (సోమవారం) రాజమండ్రి ఎయిర్పోర్టుకు వచ్చారు. ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్. జగన్నాథపురం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు పవన రాజమండ్రికి చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ