
అమరావతి, 25 నవంబర్ (హి.స.)
ఆచంట(ఏలూరు): ఎపుడూ లేని విధంగా ఈసారి కొబ్బరి ధర బంగారం రేటు వలే రోజు రోజుకు పెరిగిపోయింది. దీంతో కొబ్బరి రైతులకు కాసుల వర్షం కురిపించింది. ఒక్కసారిగా కొబ్బరికాయ రేటు వెయ్యి కాయలు 25 వేల రూపాయలు పైగానే ధర పలకడంతో అటు రైతులు ఒక్కసారిగా తమ ఆనందం వ్యక్తం చేశారు. ధర పెరగడంతో వ్యాపారుల్లో కూడా తమ వ్యాపారం బాగా బాగుందని వారు కూడా సంతోషడ్డారు. ఈ ధర సుమారు 4 నెలలు ఉన్నది. అయితే ఇటీవల మరలా ఒకేసారి కొబ్బరి ధర దిగి వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ