
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 4 గంటలకుపైగా నిర్వహించిన కేబినెట్లో పలు కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) GHMCలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో ఇప్పుడున్న NPDCL, SPDCL.. రెండు డిస్కమ్లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..