
రాజమహేంద్రవరం 26 నవంబర్ (హి.స.)
, :సుదీర్ఘ కాలంగా నిత్య విద్యార్థిగా జ్ఞాన సముపార్జనే జీవన విధానంగా మార్చుకున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి మరో మైలు రాయిని అధిగమించారు. ఇప్పటికే పలు భిన్నమైన డిగ్రీలు సాధించిన ఆయన, దేశంలోనే పేరుగాంచిన ఐఐటీ సంస్థలు నిర్వహించే ఎన్పీటీఈఎల్ కోర్సులను పూర్తిచేయడంపై దృష్టి సారించి ఒకే సెమిస్టర్లో 12 కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అంతేకాక, పరీక్షా ఫలితాల్లో 8 కోర్సులు విశిష్ట శ్రేణి(ఎలైట్ ప్లస్ గోల్డ్), 4 కోర్సులు విశిష్ట శ్రేణి(ఎలైట్ ప్లస్ సిల్వర్)లోనూ ఉత్తీర్ణత పొంది, వరుసగా మూడోసారి ‘మెగాస్టార్’ టైటిల్ను కైవశం చేసుకున్నారు. తాజాగా సాధించిన 12 సర్టిఫికెట్ కోర్సులతో కలిపి మొత్తం 73కు చేరుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ