కోనసీమ జిల్లాలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన
మలికీపురం, 26 నవంబర్ (హి.స.) ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మలికీపురం మండలంలోని గూడపల్లికి ఆయన చేరుకున్నారు. ఇటీవల తుఫాను కారణంగా కేశనపల్లి వద్ద కొబ్బరిచెట్లు దెబ్బతిన్న
పవన్


మలికీపురం, 26 నవంబర్ (హి.స.) ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మలికీపురం మండలంలోని గూడపల్లికి ఆయన చేరుకున్నారు. ఇటీవల తుఫాను కారణంగా కేశనపల్లి వద్ద కొబ్బరిచెట్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లిన ఉపముఖ్యమంత్రి అక్కడ పర్యటించారు. సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande