
న్యూఢిల్లీ, 27 నవంబర్ (హి.స.)
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి
చేరింది. మరోసారి దేశరాజధానిని పొగమంచు కప్పేసింది. ఉదయం 8 గంటలకు నగరంలో గాలి నాణ్యత AQI (Air Quality Index) 351 వద్ద నమోదైంది. బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి మరియు ఇతర ప్రాంతాలతో సహా ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలలో ఏక్యూఐ 300 కంటే ఎక్కువ నమోదైంది.
బుధవారం సాయంత్రం 4 గంటలకు నగరం యొక్క 24 గంటల సగటు ఏక్యూఐ 327 వద్ద నమోదు కాగా నేడు ఉదయం మరింత క్షీణించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..