
జోగులాంబ గద్వాల, 27 నవంబర్ (హి.స.)
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ సంతోష్ గురువారం సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనఖిలో భాగంగా కలెక్టర్ ఈ తనిఖీ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు