మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం
మహబూబ్నగర్, 27 నవంబర్ (హి.స.) మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు. హన్వాడ మండలం పల్లెమొని కాలనీ - పిల్లిగుండు దగ్గర మహబూబ్ నగర్ -తాండూర్ ప్రధాన రహదారి పై బుధవారం అర్ధరాత్రి సమయ
రోడ్డు ప్రమాదం


మహబూబ్నగర్, 27 నవంబర్ (హి.స.)

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ

మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు.

హన్వాడ మండలం పల్లెమొని కాలనీ - పిల్లిగుండు దగ్గర మహబూబ్ నగర్ -తాండూర్ ప్రధాన రహదారి పై బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆయిల్ ట్యాంక్ వాహనం, స్టీల్ కంటైనర్ల వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఆయిల్ ట్యాంక్ వాహన డ్రైవర్ ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయి మరణించాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేలా అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రయత్నం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande