
సూర్యాపేట, 27 నవంబర్ (హి.స.)
నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా రిటర్నింగ్ అధికారులు చూడాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం నూతనకల్ మండల కేంద్రంలోని ఎం ఆర్ సి భవనం, మిర్యాల, ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలలో మొదటి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎస్పీ కే. నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు