
శ్రీనగర్, 27 నవంబర్ (హి.స.) శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీలో
హిందూయేతరులకు సీట్లు ఇవ్వడంపై బీజేపీ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖలో యూనివర్సిటీలో 42 మంది ముస్లిం విద్యార్థులకు అడ్మిషన్స్ నిలిపివేవేయాలని పేర్కొంది.
అంతే కాకుండా ముఖ్యమంత్రి దేశవ్యతిరేక భావాలు కలిగి ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. వర్గాల మధ్య విభజనలను సృష్టించడం ద్వారా అడ్మిషన్ల అంశాన్ని రాజకీయం చేసి కించపరుస్తున్నారని ఆరోపించింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు