
హనుమకొండ, 27 నవంబర్ (హి.స.)
గ్రామపంచాయితీ ఎన్నికల నామినేషన్ల నేపధ్యంలో హనుమకొండ జిల్లా ఎలక తుత్తి మండలంలోని కేశవాపూర్ క్లస్టర్ను గురువారం రోజున వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా, శాంతిభద్రతల మధ్య జరిగేందుకు సంబంధించిన కీలక సూచనలు ఆయన అధికారులకు అందించారు. ఈ సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు.
ఎన్నికల నియమాలను కచ్చితంగా అమలు చేయాలని అభ్యర్థులు, ప్రజలు ఎలాంటి ఒత్తిడులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు