
అమరావతి, 28 నవంబర్ (హి.స.)
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో చెకింగ్ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. నేటి నుంచి అంటే శుక్రవారం (28-11-2025) నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ