
నిర్మల్, 28 నవంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంతో పాటు పొన్కల్
అనంత పేట గ్రామంలోని నామినేషన్ కేంద్రాలను శుక్రవారం ట్రేని అదనపు కలెక్టర్ రాకేష్ పరిశీలించారు. నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొన్కల్ ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు