
తిరుమల 29 నవంబర్ (హి.స.)
తితిదే కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ వేగవంతం చేసింది. కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్.. తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వారిలో ఏడుగురు తితిదే ఉద్యోగులు ఉన్నారు. 2019-2024 మధ్య తితిదే కొనుగోలు విభాగంలో పని చేసిన జీఎంలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై సిట్ కేసులు నమోదు చేసింది. గతంలో జీఎంలుగా పని చేసిన జగదీశ్వర్రెడ్డి, మురళీకృష్ణ, ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్రెడ్డి ఇందులో ఉన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు పేర్కొన్న నిందితుల సంఖ్య 35కి చేరింది. వారిలో 10 మందిని అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ