
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు
కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్ మేట్ వెంకటయ్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15మంది పోటీ పడ్డారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు అంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. పదివిని ఆశిస్తున్న 15మందిలో ఒకరి పేరును సీల్డ్ కవర్లో పెట్టి ప్రకటించారు.
దీంతో సీఎం స్వగ్రామానికి కాబోయే సర్పంచ్ ఎవరవుతారు అనే సస్పెన్స్ వీడింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు