
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు
సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసి విషయం తెలిసిందే. అయితే, ఆ ఉత్తర్వులను స్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై బెంచ్కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు