
అమరావతి, 3 నవంబర్ (హి.స.)
పల్నాడు: మాజీ మంత్రి, వైకాపా నేత విడదల రజని పీఏ, అనుచురులపై దోర్నాలకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థి కృష్ణ, మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని విడదల రజని పీఏలు శ్రీకాంత్రెడ్డి, దొడ్డా రామకృష్ణ.. ఆమె ముఖ్య అనుచరులు శ్రీగణేశ్, అతని సోదరుడు కుమారస్వామి రూ.5 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ