
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.)చర్ల: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో ఆదివారం 37 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట వీరంతా సరెండర్ అయ్యారు.
లొంగిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు ఉన్నారు. వీరిపై రూ.67 లక్షల మేర రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం తక్షణ సాయం కింద రూ.50 వేలు చొప్పున నగదు సాయం అందించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు