నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త FIR.. సోనియా, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్రకేసు నమోదు
న్యూఢిల్లీ, 30 నవంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్త FIR నమోదు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) మరో ఎఫ్ఎఆర
నేషనల్ హోరల్డ్


న్యూఢిల్లీ, 30 నవంబర్ (హి.స.)

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్త FIR నమోదు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) మరో ఎఫ్ఎఆర్ ను నమోదు చేసింది. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలను నిందితులుగా చేర్చింది. వారిలో శామ్ పిట్రోడా,మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అలాగే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా తాజాగా నమోదైన ఎఫ్ఎఆర్ లో ఉన్నాయి. వీరంతా నేషనల్ హెరాల్డ్ పేపర్ మాతృసంస్థ అయిన ఏజేఎల్ ను మోసపూరితంగా చేజిక్కించుకునేందుకై క్రిమినల్ కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ.

కోల్కతాకు చెందిన షెల్ కంపెనీగా చెప్పుకున్న డోటెక్స్ మర్చంటైజ్.. ఇద్దరు కాంగ్రెస్ నాయకులు 76 శాతం వాటాను కలిగి ఉన్న యంగ్ ఇండియన్ కు రూ. కోటి అందించిందని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande