
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్
కంపెనీలు మరోసారి అల్టిమేటం జారీ చేసాయి. పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే లిక్కర్ ఉత్త్పతి ఆపేస్తామని హెచ్చరించాయి. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే డిసెంబర్లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.
సర్కారు నుంచి ₹3,366 ఓట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీ కంపెనీలు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..