ఏపి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక
అమరావతి, 5 నవంబర్ (హి.స.) : ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకున్నారు. లండన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి
ఏపి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక


అమరావతి, 5 నవంబర్ (హి.స.)

: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకున్నారు. లండన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ అవార్డును అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చేస్తున్న ప్రజాసేవకు గుర్తింపుగా భువనేశ్వరికి ఈ అవార్డును అందజేశారు. ఇక కార్పొరేట్ గవర్నెన్స్‌ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించారు (Nara Bhuvaneshwari Distinguished Fellowship Award).

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తున్న పలు సేవాకార్యక్రమాల గురించి వివరించారు. సంజీవని ఫ్రీ హెల్త్ క్లీనిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వటంతో పాటు వారి సామర్ధ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణను అందిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande