
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)
తిరుపతి: తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. కపిలతీర్థం వద్ద రెండు హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రెండు హోటళ్లలో అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ నెలలోనూ తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ