
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)
నెల్లూరు: దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పట్టణంలోని గాంధీ బొమ్మ, కనమహాల్ సెంటర్, నిప్పు సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి నాట్లు వేస్తున్నారు. ఈ వర్షంతో నాట్లు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ