
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ( ) పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఉదయం (సోమవారం) నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9:00 గంటలకే 62.40 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము అందజేశారు. ఇక ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గొల్లగూడెం, గోపీనాథపట్నం లబ్ధిదారులకు సీఎం పింఛన్లు ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ