
జగిత్యాల, 10 డిసెంబర్ (హి.స.)
రైతుల పంట పొలాలకు వెళ్లే దారిని
కొందరు ఆక్రమించి, కబ్జా చేసి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని వెల్లుల్ల రోడ్లో గల ఎస్సారెస్పీ కాలువను ఆనుకుని సర్వే నెంబర్ 1094లో నిర్మిస్తున్న ఓ ప్రైవేట్ వెంచర్' 40 ఫీట్ రోడ్ నుండి మల్లెతోట వరకు సీసీ రోడ్డు నిర్మించి రైతులకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు