
నారాయణపేట, 11 డిసెంబర్ (హి.స.) పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నేడు నారాయణపేట జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. గడువులోగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను క్యూలైన్లో ఉంచి వారికి టోకెన్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి మద్దూరు మండలంలోని పెదిరిపాడు, చెన్నారెడ్డి పల్లి, కొత్తపల్లి మండల కేంద్రం, కొత్తపల్లి తండా లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ నమోదు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లతో ఆమె మాట్లాడి సౌకర్యాల గురించి ఆరా తీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు