
జనగామ, 13 డిసెంబర్ (హి.స.)
జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురంలో గత రాత్రి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యశస్విని రెడ్డి పై సొంత పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు. పార్టీకి అనుకూలంగా పని చేసేవారికి కాకుండా, మీకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్ అభ్యర్ధిగా ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా నిలదీశారు.
కార్యకర్తలకు సమాధానం చెప్పలేక ఒక ఆడబిడ్డపై తిరగబడతారా అంటూ పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే అక్కడనుండి తప్పుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు