
న్యూఢిల్లీ, 13 డిసెంబర్ (హి.స.)
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం
పేరును పూజ్య బాబు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పథకం పేరు మారిస్తే ఏం ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులు, పత్రాలపై పేర్లు మార్చడం ద్వారా ఖర్చు పెరుగుతుంది తప్ప లాభం లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, గాంధీ పేరును అగౌరవపర్చడానికి ఇది కేవలం డైవర్ట్ చేయడానికి తప్ప మరి దేనికీ పనిచేయదని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..