
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఈ సాయంత్రం హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్పేడియంలో నిర్వహించబోయే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కూడా నగరానికి వచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్లో నిర్వహించబోయే 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమానికి వారు హాజరుకానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు