రవీంద్రభారతిలో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.) తెలుగు సినీ సంగీతానికి చిరస్థాయిగా నిలిచిన గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతికి నివాళిగా ఈ నెల 15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్
ఎస్పీ బాలు విగ్రహం


హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)

తెలుగు సినీ సంగీతానికి చిరస్థాయిగా నిలిచిన గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతికి నివాళిగా ఈ నెల 15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి సినీ సంగీత స్వరనీరాజనం కార్యక్రమం జరగనుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు వెల్లడించారు. బాలు పాడిన అమరగీతాలను ప్రముఖ గాయకులు, కళాకారులు ఆలపించనుండగా… సంగీతాభిమానులకు ఇది ఓ మరపురాని అనుభూతిగా నిలవనుంది.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ఎంట్రీ పాసులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాసుల పంపిణీ కోసం 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రవీంద్రభారతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల బాలు విగ్రహం ఏర్పాటు అంశంపై కొంత వివాదం నెలకొన్నప్పటికీ, అన్ని అడ్డంకులను అధిగమించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande