
శ్రీశైలం, 14 డిసెంబర్ (హి.స.)
శ్రీశైలంలో బ్యాంకు ఏటీఎం యంత్రాలు పనిచేయడం లేదు. నెట్వర్క్ సమస్యతో నగదు డ్రాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీశైలంలోని ఆలయంలో దర్శన టోకెన్ల కొనుగోలుకు డిజిటల్ చెల్లింపుల అవకాశం లేదు. దీంతో ఇక్కడికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. వారాంతం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ